పార్లమెంట్ సమావేశాలు 6 వరకు పొడిగింపు
న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్ సమావేశాలను వచ్చే నెల 6 వరకు పొడిగించారు. ప్రస్తుత వర్షాకాల సమావేశాలు ఈ నెల 30 న ముగియాల్సి ఉంది. అయితే వివిధ పక్షాల ఆందోళనలతో సభా సమయం వృథా కావడంతో సమావేశాలను పొడిగిస్తూ పార్లమెంట్ వ్యవహారాల కేబినేట్ కమిటీ సోమవారం నిర్ణయించింది. ఆహార భద్రత, ఆర్థిక సంస్కరణలు, భూ సేకరణ తదితర కీలక బిల్లులపై పార్లమెంట్లో చర్చించాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.