బుద్ధగయ పేలుళ్లకు నిరసనగా బౌద్ధ సన్యాసుల ప్రదర్శన

బ్యాంకాక్‌: మహాబోధి అలయంలో భద్రతను పెంచాలంటూ బౌద్ధ సన్యాసులు బ్యాంకాక్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయం ముందు, భారత ఎంబసీ ముందు బుధవారం ప్రదర్శన చేపట్టారు. దాదాపు నాలుగు వందల మంది బౌద్ధ సన్యాసులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. బుద్ధుడికి జ్ఞానోదయం కలిగిన చోటు కావడంతో మహాబోధి అలయం విశ్వవ్యాప్త బౌద్ధమతానికి గుండెకాయ లాంటిదని, అలాంటి అలయంలో ఉగ్రవాద పేలుళ్లు తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయని వారు పేర్కొన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, భద్రతను పటిష్ఠపరచి అలయాన్ని కాపాడాలని వారు భారత ప్రభుత్వాన్ని కోరారు.