యూషెస్‌ తొలిటెస్ట్‌ లో బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌

నాటింగ్‌హామ్‌,(జనంసాక్షి): ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య యూషెస్‌ సమరం ప్రారంభమయింది. ట్రెంట్‌బ్రిడ్జి మైదానంలో తొలిటెస్ట్‌ మ్యాచ్‌ బుధవారం ఆరంభమయింది. టాస్‌ గెలిచిన ఇంగ్లీషు జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ కుక్‌, రూట్‌ ఓపెనర్లుగా బ్యాటాంగ్‌కు వచ్చారు.
వరుసగా రెండుసార్లు యాషెస్‌ గెలిచి హ్యాట్రిక్‌పై కన్నేసిన ఇంగ్లండ్‌ ఈ సారి స్వదేశంలోనూ సత్తా చూపాలని కసిగా ఉంది. మరోవైపు వరుస ఓటములతో సతమతమవుతున్న ఆసీస్‌ యాషెస్‌ విజయం ద్వారా స్వదేశంలో అభిమానుల మనసులు గెలవాలని ఆశిస్తుంది.