అత్యాచారం కేసులో దోషికి ఎనిమిదేళ్ల కఠిన కారాగారం

జబల్పూర్‌: మధ్యప్రదేశ్‌లోని ఉమరియా జిల్లా న్యాయ స్థానం విదేశి మహిళపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి ఎనిమిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. గత జనవరిలో పర్యాటకురాలిగా వచ్చిన ఒక విదేశీ వనితపై దీపక్‌ విశ్వకర్మ అనే రిసార్ట్‌ మేనేజర్‌ అత్యాచారానికి పాల్పడ్డట్టు నేరం నిరూపితం కావడంతో న్యాయమూర్తి ఈ శిక్ష విధించారు.