బుద్ధగయ కేసు విచారణకు పాట్నాలో ప్రత్యేక న్యాయస్థానం

పాట్నా: మహాబోధి ఆలయంలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనపై విచారణకు పాట్నాలో ఒక ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేశారు. పాట్నా సివిల్‌ కోర్టు అవరణలోనే దీన్ని ఏర్పాటు చేశారు. 1500 ఏళ్ల చరిత్ర గల మహాబోధి ఆలయ ప్రాంగణంలో , పరిసరాల్లో జులై 7న ఉదయం వరసగా 10 బాంబులు పేలిన సంగతి తెలిసిందే.