ఛాప్రాలో బంద్‌ హింసాత్మకం

బీహార్‌: ఛాప్రాలో భాజపా, అర్జేడీ నేతలు బుధవారం బంద్‌కు పిలుపునిచ్చారు. మధ్యాహ్న భోజనం వికటించి 20 మంది విద్యార్థులు మృతి చెందిన ఘటనకు నిరసనగా వీరు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఛాప్రాలో బంద్‌ హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పంటించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.