నేటి నుంచి ప్రారంభమైన యాషెన్‌ రెండో టెస్టు

లండన్‌: లార్డ్స్‌లో యాషెన్‌ రెండో టెస్టు గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌1-0 అధిక్యం సాధించిన ఇంగ్లాండ్‌ తన అధిక్యాన్ని 2-0కు పెంచుకోవాలనంకుంటుండగా, సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో కంగారూ జట్టుంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా 14 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై ఓడిపోయింది. ఆస్ట్రేలియా జట్టులో తీవ్ర విభేదాలున్నాయని మాజీ కోచ్‌ ఆర్థర్‌ వెల్లడించడం జట్టుకు తీవ్ర ఇబ్బందిగా మారింది. సాయంత్రం 3.45 నుంచి స్టార్‌ క్రికెట్లో మ్యాచ్‌ ప్రసారం కానుంది.