యానాం వరద పరిస్థితిపై అసెంబ్లీలో ప్రస్తావన

యానాం: గత మూడు రోజులుగా యానాం నియోజకవర్గంలోని పల్లపు ప్రాంతాలు వరద నీటిలలో ముంపునకు గురైనా పుదుచ్చేరి ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితిపై యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు అసెంబ్లీలో ప్రస్తావించారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశం శూన్యగంటలో యానాంలో వరద తీవ్రతపై ఫోటోలతో సహా వివరించారు. వరద బాధితులకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని కోరారు. పుదుచ్చేరి నుంచి సహాయ బృందాన్ని పంపించాలని సభలో ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. ప్రాంతీయ పరిపాలనాధికారి ఎస్‌. గణేషన్‌ వరద బాధితులకోసం ఏర్పాటు చేసిన శిబిరాలను పర్యవేక్షించి బాధితులకు భోజన సదుపాయాలను కల్పించారు.