భద్రతా సిబ్బందికి చిక్కిన మావోయిస్టులు

ఒడిశా: మల్కన్‌గిరి జిల్లాలో భద్రతా సిబ్బంది ఇద్దరు మావోయిస్టులను పట్టుకున్నారు. పట్టుబడినవారిలో మావోయిస్టు కమాండెంట్‌ చంటి, మంగరాజు హంటల్‌ ఉన్నట్లు భద్రతా సిబ్బంది తెలిపారు. పట్టుబడిన ఇద్దరు మావోయిస్టులు బలిమెల, చిత్రకొండ ఘటనలో పాల్గొన్నట్లు సమాచారం.