అంపైర్‌ నిర్ణయంపై కోహ్లీ అసంతృప్తి

హరారే: జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డే మాచ్‌లో తన అవుట్‌పై భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండో వన్డే ఏడో ఓవర్లో జార్విన్‌ విసిరిన బంతిని కోహ్లి మిడ్‌ వికెట్‌వైపు కొట్టగా ఫీల్డర్‌ వాలర్‌ క్యాచ్‌ పట్టాడు. అతను క్యాచ్‌ పట్టిన తీరు క్లియర్‌గా లేదని కోహ్లీ గ్రౌండ్‌ వీడలేదు. దీంతో ఫీల్డ్‌ అంపైర్‌ థర్డ్‌ అంపైర్‌ను కోరగా అతను కూడా ఔటైనట్లు ప్రకటించాడు.థర్డ్‌ అంపైర్‌ నిర్ణయానికి కోహ్లీ పెవిలియన్‌కు చేరక తప్పలేదు. ఈ మ్యాచ్‌లో మొత్తం 18 బంతులను ఎదుర్కున్న కోహ్లీ 14 పరుగులు చేశాడు.