పోరాటానికి సిద్ధమైన ఇండియా మ్యాచ్‌

బులవాయో: విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని టీమ్‌ ఇండియా ఐదో వన్డే (చివరి)లో జింబాబ్వేతో పోరాటానికి సిద్ధమైంది. చివరి మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను 5-0తో క్లీన్‌ స్వీప్‌ చేయాలని భారత్‌ ఉవ్విళ్లూరుతోంది. మధ్యాహ్నం 12.30 నుంచి టెన్‌ స్పోర్ట్స్‌, టెన్‌క్రికెట్‌లో మ్యాచ్‌ ప్రసారం కానుంది.