మరోసారి ఉల్లంఘన యూరి సెక్టార్‌లో కాల్పులు

శ్రీనగర్‌: నిన్న పూంఛ్‌ సెక్టార్‌లో కాల్పుల ఘటన తాలూకు పరిణామాలు ఒక పక్క దేశ రాజకీయా రంగాన్ని కుదిపేస్తుంటే పాకిస్థాన్‌ మరోసారి కయ్యానికి కాలుదువ్వింది. ఇవాళ యూరి సెక్టార్‌లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరపగా భారత సైన్యం ఎదురు కాల్పులు జరిపింది. ఇరుపక్షాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు పాకిస్థానీ సైనీకులు గాయపడినట్లు సైన్యానికి చెందిన వర్గాలు పేర్కొన్నాయి.