రేపోని గ్రామంలో దారుణం

వరంగల్‌,(జనంసాక్షి): జిల్లాలోని నర్సింహులపేట మండలం రేపోని గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన విజయరావుపై ప్రత్యర్థులు దాడి చేసి గొడ్డళ్లతో నరికి చంపారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.