కిష్ట్యార్‌ ఘటనపై రాజ్యసభలో ప్రకటన: చిదంబరం

ఢిల్లీ: ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణను ఉగ్రవాదంతో ముడిపెట్టడం సబబు కాదని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం రాజ్యసభలో పేర్కొన్నారు. కిష్ట్యార్‌ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించామని, ఆయన చెప్పారు. ఈ ఘటనకు, ఉగ్రవాదానికి సంబంధం లేదన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన ఘర్షణ చినికి చినికి గాలివాన అయిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లోని 8 జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతోందని చిదంబరం చెప్పారు. కాశ్మీర్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన సహాయాన్ని కేంద్రం అందిస్తుందని, కాశ్మీర్‌ ప్రాంతం నుంచి వలసలను తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రతిచోటా ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించడమే తమ లక్ష్యమన్నారు. కిష్ట్వార్‌లో పరిస్థితి అదుపులోకి వచ్చాక భాజపా నేతలను అనుమతిస్తామన్నారు. అక్కడ సాధారణ పరిస్థితి ఉందని త్వరలోనే ఈ సభలో చెప్పానని ఆర్థికమంత్రి సభకు హామీ ఇచ్చారు.