తెలంగాణపై ఇప్పటికీ స్పష్టమైన మార్గసూచీ లేదు: విశ్వజిత్‌ దాల్మనీ

ఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణపై నిర్ణయంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లకు ప్రాతిపదిక దొరికిందని, 2003 నుంచి ఇప్పటిదాకా తెలంగాణ అంశాన్ని పరిశీలిస్తున్నామని అస్సాం బోడో పీపుల్స్‌ ఫ్రంట్‌ సభ్యుడు విశ్వజిత్‌ దాల్మనీ పేర్కొన్నారు. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌ పరిణామాలపై చర్చ కొనసాగుతుంది. తెలంగాణ అంశంపై ఇప్పటికీ స్పష్టమైన మార్గసూచీ లేదని ఆయన పేర్కొన్నారు. బోడోలాండ్‌ సహా ఇతర రాష్ట్రాల డిమాండ్లు కూడా న్యాయసమ్మతమైనవేనని అర్థమవుతుందని ఆయన అన్నారు.