కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంగించిన పాక్‌

శ్రీనగర్‌ : నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించింది. జమ్ము కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ బలగాలు కాల్పులకు పాల్పడ్డాయి. అయితే భారత సైనికులు ఈ దుశ్చర్చను సమర్ధంగా తిప్పికొట్టారు. గత మూడు రోజుల్లో కాల్పులు విరమణ ఒప్పందాన్ని పాక్‌ తుంగలో తొక్కడం ఇది ఆరోసారి.