లాలూ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): దాణా కుంభకోణం కేసు విచారణను వేరే కోర్టుకు మార్చాలన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో వీలైనంత త్వరగా తీర్పు వెలువరించాలని ట్రయల్‌ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.