ప్రారంభమైన పార్లమెంట్‌ ఉభయ సభలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌: ఉభయ సభులు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే సీమాంధ్ర టీడీపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటూ టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. టీడీపీ ఎంపీల ఆందోళనల మధ్య స్పీకర్‌ మీరాకుమార్‌ ప్రక్షశ్నోత్తరాలు చేపట్టారు.