కిష్ఠావర్ పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని సీఎస్ను ఆదేశించిన కోర్టు
న్యూఢిల్లీ,(జనంసాక్షి): జమ్మూకాశ్మీర్లోని కిష్ఠావర్లో నెలకొన్న పరిస్థితులపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీలైనంత త్వరగా అక్కడి పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని జమ్మూ కాశ్మీఱ్ సీఎస్ను కోర్టు ఆదేశించింది. గత మూడు రోజుల నుంచి అక్కడ కర్ఫ్యూ కొనసాగుతుంది.