సీబీఐ ఓర్టులో లొంగిపోయిన పాండే

అహ్మదాబాద్‌ : సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ దరాఖాస్తును తిరస్కరించడంతో గుజరాత్‌ ఐసీఎస్‌ అధికారి పి.పి. పాండే ఈ రోజు సీబీఐ న్యాయస్థానంలో లొంగిపోయారు. ఇష్రత్‌ జహా ఎన్‌కౌంటర్‌ కేసులో ఆయన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన 1982 సంవత్సరానికి చెందిన ఐపీఎస్‌ బ్యాచ్‌ అధికారి. గుజరాత్‌లో అదనపు డీజీపీ (క్రైమ్‌)గా పనిచేస్తున్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన సమయంలో ఆయన అహ్మదాబాద్‌ జాయింట్‌ కమిషనర్‌గా పనిచేశారు.