హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు : కాగ్‌

ఢిల్లీ : అగస్టా హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు జరిగినట్లు కాగ్‌ ప్రకటించింది. హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో నిర్ణీత ధరకన్నా ఎక్కువగా చెల్లించారని కాగ్‌ తెలిపింది. రూ. 3966 కోట్లకు ఇస్తామన్న హెలికాప్టర్లకు రూ. 4871.5 కోట్లు చెల్లించినట్లు కాగ్‌ ప్రకటించింది. హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో రక్షణశాఖ నిబంధనలు ఉల్లంఘించిందని కాగ్‌ పేర్కొంది.