ప్రధానిని కలిసిన ఏకే ఆంటోని
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ముంబయి నావికాదళం రేవులో జలాంతర్గామిలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై రక్షణ మంత్రి ఏకే ఆంటోని ప్రధాని మన్మోహన్సింగ్ను కలిసి వివరించారు. ముంబయి నివాకాదళం రేవును ఆంటోని గురువారం సందర్శించనున్నారు. జలాంతర్గామి పేలుడులో విశాఖ జిల్లా పెదగంట్యాడుకు చెందిన నావికుడు రాజేష్ మృతి చెందిన విషయం విదితమే.