రాష్ట్ర విభజన సున్నితమైన అంశం: దిగ్విజయ్‌సింగ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ విభజనపై ఎవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు అని ఇరు ప్రాంతాల నేతలను హెచ్చరించామని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. రాష్ట్ర విభజన అంశం సున్నితమైన అంశం అని అనవసర రాద్దాంతం చేయొద్దు అని చెప్పారు. విభజన విషయంలో సీమాంధ్ర నేతల అభ్యంతరాలను పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఆంటోని కమిటీతో భేటీకి సీమాంధ్ర మంత్రులను ఆహ్వానించామని కలవడానికి అభ్యంతరం ఉన్న పార్టీలు సభలో వాదన వినిపించొచ్చు అని సూచించారు. ఆంటోని కమిటీ ఉండగా ప్రభుత్వం తరపున మరో కమిటీ అవసరం లేదు అని దిగ్విజయ్‌ స్పష్టం చేశారు.