కనిష్ఠ స్థాయికి పడిపోయిన రూపాయి విలువ

ముంబయి,(జనంసాక్షి): డాలర్‌తో రూపాయి మారకం విలువ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇవాళ రూ. 62 లుగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 400 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌, 100 పాయింట్లకు పైగా నష్టంలో నిప్టీ ట్రేడవుతున్నాయి.