జంతర్మంతర్ వద్ద విశాలాంధ్ర మహాసభ నేతల ధర్నా
ఢిల్లీ : రాష్ట్ర విభజనను నిరసిస్తూ విశాలాంధ్ర మహాసభ నేతలు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఢిల్లీలోని తెలుగు ఉద్యోగులు, ప్రవాసాంధ్రులు ధర్నాలో పాల్గొని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నినాదాలు చేశారు. ఏపీ భవన్ సమైక్యాంధ్ర ఎంప్లాయిస్ ఐకాస ఆధ్వర్యంలో నిరసన యాత్ర చేపట్టారు.