నేడు ఆంటోని కమిటీతో భేటీ కానున్న టీ కాంగ్రెస్‌ నేతలు

ఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు ఈ రోజు ఢిల్లీలో ఆంటోని కమిటీతో సమావేశం కానున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు కమిటీ ముందుకు హాజరై రాష్ట్ర విభజనపై సీమాంధ్రుల అభ్యంతరాలు, సమస్యలపై స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. రేపు సీమాంధ్ర ప్రాంత నేతల అభ్యంతరాలు, డిమాండ్లు ఆంటోని కమిటీ తెలుసుకోనుంది