కనిష్ఠస్థాయికి పడిపోయిన రూపాయి మారకం విలువ

ముంబయి,(జనంసాక్షి): డాలర్‌తో రూపాయి మారకం విలువ మరోసారి కనిష్ఠ స్థాయికి పడిపోయింది. సోమవారం మధ్యాహ్నానికి ఇది రూ. 62.45 గా నమోదైంది. స్టాక్‌ మార్కెట్లు కూడా పెద్ద ఎత్తున నష్టాలు చవిచూస్తున్నాయి. సెన్సెక్స్‌ 394 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 5400 పాయింట్లకన్నా తక్కువగా ట్రేడవుతుంది. బ్యాంకింగ్‌, ఆటో రంగాల షేర్లపై ఈ ప్రభావం పడింది.