సాంకేతిక లోపం వల్లే సింధూరక్షక్‌ ప్రమాదం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ముంబై తీరంలో అగ్ని ప్రమాదం కారణంగా సముద్రంలో మునిగిపోయిన అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ సిందూ రక్షక్‌ ప్రమాద ఘటనపై రక్షణ మంత్రి ఆంటోని రాజ్యసభలో ప్రకటన చేశారు. సింధూరక్షక్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగానే ప్రమాదం జరిగి పేలుడు  సంభవించిందని ఈ కారణంగానే జలాంతర్గామి మునిగి పోయిందని ఆయన వివరించారు.