ఢిల్లీ చేరుకున్న తెలంగాణ నేతలు

ఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతల బృందం ఢిల్లీ చేరుకుంది. ఇవాళ రాత్రి ఎనిమిది గంటలకు వాళ్లు ఆంటోని  కమిటీని కలువనుంది. తెలంగాణ ఏర్పాటు బిల్లును ఈ సమావేశాల్లోనే పార్లమెంట్‌ లో ప్రవేశపెట్టాలని బృందం సభ్యుల ఆంటోనీని కోరనున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ బృందంలో ఉన్నారు.