దస్త్రాల గల్లంతుపై దద్ధరిల్లిన లోక్సభ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): బొగ్గు కుంభకోణం దస్త్రాల గల్లంతుపై ఇవాళ లోక్సభ దద్దరిల్లింది. వాయిదా అనంతరం తిరిగి లోక్సభ ప్రారంభమైన వెంటనే బొగ్గు కుంభకోణం దస్త్రాల గల్లంతు అంశాన్ని భాజపా పక్షనేత సుష్మాస్వరాజ్ లేవనెత్తారు. దస్త్రాల గల్లంతుకు కారణం ఎవరు, బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. దీనిపై ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో భాజపా సభ్యులు ఆందోళనకు దిగడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది.