బొగ్గు ఫైళ్ల అదృశ్యాన్ని లేవనెత్తిన బీజేపీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌ ఉభయసభల్లో బొగ్గు కుంభకోణానికి సంబంధించి ఫైళ్ల అదృష్యాన్ని బీజేపీ లేవనెత్తింది. ఫైళ్ల అదృశ్యంపై ప్రధాని సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. లోక్‌సభలో సుష్మాస్వరాజ్‌, రాజ్యసభలో వెంకయ్యనాయుడు ఈ అంశాన్ని లేవనెత్తారు.