పాక్‌కాల్పులను తిప్పి కొట్టిన భారత జవాన్లు

జమ్మూ కాశ్మీర్‌,(జనంసాక్షి): దాయాది దేశం పాకిస్థాన్‌ మళ్లీ భారత సరిహద్దులోల కాల్పులకు తెగబడింది. ఈ కాల్పులను భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు. పూంఛ్‌ జిల్లాలోని హమీర్‌పూర్‌, మేంధర్‌ సరిహద్దుల్లో ఇవాళ పాక్‌ సైనిక మూకలు కాల్పులు జరిపారు. అందుకు ప్రతిగా భారత సైనికులు కాల్పులు జరిని వారిని సరిహద్దుల వరకు తిప్పి కొట్టారు.