నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి : రూపాయి పతనం ప్రభావం స్టాక్ మార్కెట్లపైనా పడుతోంది. ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు మధ్యాహ్నానికి నష్టాల బాట పట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 400 పాయింట్లు, ఎస్ఎస్ఈ నిఫ్టీ 120 పాయింట్ల నష్టంలో కొనసాగుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. బుధవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో డాలర్లో రూపాయి మారకం విలువ రూ. 64.44గా నమోదైంది.