ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్‌ కన్నుమూత

చెన్నై : ప్రముఖ తెలుగు రచయిత్రి, సాహిత్య అకాడమీ అవార్డు గ్రాహీత మాలతీ చందూర్‌ (84) చెన్నైలో కన్నుమూసారు. గత కొంతకాలంగా ఆమె క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. 1952 నుంచి తెలుగు పాత్రికేయరంగంలో ఉన్న ఆమె దాదాపు 25కు పైగా పుస్తకాలను రచించారు తెలుగు సచిత్ర వారపత్రికల్లో ఆమె పలు శీర్షికలను రచించారు. పాఠకుల ప్రశ్నలకు సమాధానాలతో పాటు పలు వంట కార్యక్రమాలపై ఆమె శీర్షికలను నిర్వహించారు.