అనిల్‌ అంబానీ వాంగ్మూలం నమోదు

ఢిల్లీ,(జనంసాక్షి): 2జీ కేసులో సాక్షిగా హాజరైన అడాగ్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ వాంగ్మూలాన్ని ఈ రోజు నమోదు చేశారు. టీనా అంబానీ రేపు హాజరవుతారని అనిల్‌ అంబానీ న్యాయస్థానానికి తెలిపారు. సీబీఐ తరపున సాక్షిగా హాజరైన ఆయన పలు ప్రశ్నలకు నాకు గుర్తులేదు అన్న సమాధానమే ఇచ్చినట్లు సమాచారం.