గుజరాత్ డీజీపీ అమితాబ్ కన్నుమూత
న్యూఢిల్లీ,(జనంసాక్షి): గుజరాత్ డీజీపీ అమితాబ్ పాఠక్ కన్నుమూశారు. ఆయన 1977 ఐపీఎస్ బ్యాచ్కు చెందినవారు. పాఠక్ 2015 ఫిబ్రవరిలో పదవీ విరమణ చేయాల్సి ఉంది. గతంలో అహ్మదాబాద్ నగర కమిషనర్గా పనిచేశారు. గాంధీ నగర్ రేంజ్ ఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు.