మీడియా శత్రుభావంతో వ్యవహరించవద్దు : సోనియాగాంధీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రభుత్వం పట్ల మీడియా శత్రుభావంతో వ్యవహరించొద్దు అని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ కోరారు. ఢిల్లీలో జాతీయ మీడియా కేంద్రాన్ని సోనియా గాంధీ, ప్రధాని యన్మోహన్‌సింగ్‌ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తే ఆహ్వానిస్తామని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టే అభివృధ్ది కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసే విధంగా మీడియా వ్యవహరించాలని చెప్పారు.