అత్యాచార ఘటనలతో దేశ ప్రతిష్ఠ దెబ్బతింటుంది : సుష్మాస్వరాజ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలతో దేశ ప్రతిష్ఠ దెబ్బతింటుందని బీజేపీ సీనియర్‌ నేత సుష్మాస్వరాజ్‌ పేర్కొన్నారు. నిందితులకు ఉరిశిక్ష పడేలా చూడాలని ఆమె అన్నారు. ముంబయి లాంటి ఘటనలు భారతదేశాన్ని అపఖ్యాతిపాలు చేస్తున్నాయన్నారు. భారతదేశంలో మహిళలు ఒకవైపు ఉన్నతస్థానాలను అలంకరిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమన్నారు.