దస్త్రాల గల్లంతుపై ఆందోళనకు దిగిన భాజపా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బొగ్గు శాఖలో దస్త్రాల గల్లంతుపై ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ భాజపా ఆందోళనకు దిగింది. ఈ రోజు ఉదయం లోక్‌సభ ప్రారంభమైన వెంటనే భాజపా సభ్యులు బొగ్గు కుంభకోణం అంశాన్ని లేవనెత్తారు.