దేశీయ కారణాల వల్లే రూపాయి పతనం: చిదంబరం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): దేశీయ కారణాల వల్లే రూపాయి పతనం చెందుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. ఇవాళ రాజ్యసభలో రూపాయి పతనంపై మాట్లాడారు. రూపాయి విలువ సరైన స్థాయికి చేరుకుంటుందని భరోసా ఇచ్చారు. మే 22 నుంచి రూపాయిపై ఒత్తిడి ఉందని తెలిపారు. పెట్టుబడులను ప్రోత్సహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.