ఆహార భద్రత అమలుకు ఢోకా లేదు : చిదంబరం
న్యూడిల్లీ,(జనంసాక్షి): రూపాయి పతనం వల్ల ఆహార భద్రత బిల్లు అమలుకు ఎలాంటి ఢోకా ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం పేర్కొన్నారు. నిన్న లోక్సభలో ఆహారభద్రతా బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ రోజు డాలర్తో రూపాయి మారకం విలువ 65.93కి పడిపోయింది. స్టాక్మార్కెట్లు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి. 67 శాతం జనాభాకి ఆహార భద్రతనిచ్చే ఈ బిల్లు అమలుకు రూ. 1.25 లక్షల కోట్లు ఖర్చువుతాయని అంచనా. అయితే అది బడ్జెట్లో తాను విధించుకున్న పరిమితులకు లోబడే ఉందని చిదంబరం విలేకరులకు తెలిపారు.