నిర్ణయం జరిగిపోయింది : ఏపీఎన్టీఓలతో ప్రధాని

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకుందని ఏపీఎన్టీఓలకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఇవాళ ఏపీ ఎన్టీఓతో పాటు సీమాంధ్రకు చెందిన విద్యుత్‌, ఆర్టీసీ ఉద్యోగులు, విద్యార్థులు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను  కలిశారు. సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుంటామన, రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలపై ప్రభ్వు కమిటీ వేస్తామని సీమాంధ్ర ఉద్యోగులతో ప్రధాని చెప్పినట్లు సమాచారం.