సుష్మాస్వరాజ్‌ను కలిసిన ఏపీఎన్టీవోలు

ఢిల్లీ,(జనంసాక్షి): బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేత సుష్మాస్వరాజ్‌ను ఏపీఎన్టీవో నేతలు కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సహకరించాలని ఈ సందర్భంగా వారు సుష్మాస్వరాజ్‌ని కోరారు. దీనికి స్పందించిన సుష్మస్వరాజ్‌ విభజనపై వెనక్కు తగ్గేది లేదని మీ అభ్యంతరాలు తెలపాలని ఎన్టీవోలను కోరినట్లు సమాచారం.