తెలంగాణపై నిర్ణయం జరిగిపోయింది : దిగ్విజయ్సింగ్
ఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం జరిగిపోయిందని సీమాంధ్ర ప్రాంత సచివాలయ, విద్యుత్ ఉద్యోగులతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ దిగ్విజయ్సింగ్ తేల్చిచెప్పారు. ఈ రోజు ఢిల్లీలో సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు దిగ్విజయ్ను కలిశారు. తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని దిగ్విజయ్ చెప్పడంతో దిమ్మతిరిగిన సీమాంధ్ర ఉద్యోగులు ఆయన కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.