డిసెంబర్‌లో జీఎస్‌ఎల్వీ ప్రయోగం : ఇస్రో

బెంగళూరు,(జనంసాక్షి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న జీఎస్‌ఎల్వీ-డీ5ను డిసెంబర్‌లో ప్రయోగించే అవకాశం ఉందని బుధవారం ఇస్రో అధికారులు తెలిపారు. కమ్యూనికేషన్‌ ఉపగ్రహంతో ఈ నెల 19 న నింగికి ఎగరాల్సిన జీఎస్‌ఎల్వీ-డీ5 ప్రయోగాన్ని దానిలోని క్రయోజనిక్‌ ఇంజిన్‌లో ఇంధనలీకేజీ కారణంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాకెట్‌లో ఇంధనం లీకయిన రెండో దశ భాగాలను విడదీసే పనిలో ఇస్రో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు.