పుదుచ్చేరి మాజీ లెప్టినంట్‌ గవర్నర్‌ కన్నుమూత

నాగ్‌పూర్‌,(జనంసాక్షి): పుదుచ్చేరి మాజీ లెప్టినెంట్‌ గవర్నర్‌, విద్యావేత్త డాక్టర్‌ రజనీ రాయ్‌ గురువారం తెల్లవారుజామున కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె వయసు 83 ఏళ్లు. ఆమెకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. స్థానిక బాలికల కళాశాలకు  ప్రిన్సిపల్‌గా పనిచేసిన రజనీరాయ్‌ భాజపా మహిళా విభాగంలో క్రియాశీలంగా ఉండేవారు. 1998 ఏప్రిల్‌ నుంచి 2002 జులై వరకు రజనీరాయ్‌ పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా పనిచేశారు.