భూసేకరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

న్యూఢిల్లీ,(జనంసాక్షి):పారిశ్రామిక అవసరాల కోసం భూసేకరణలో జరిగే అక్రమాలను అరికట్టే ముఖ్య ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లు ఆమోదం పొందింది. మూజువాణి ఓటుతో ఈ బిల్లు నెగ్గింది. అనుకూలంగా 216 ఓట్లు రాగా వ్యతిరేకంగా 19 ఓట్లు వచ్చాయి.