ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వ అసమర్థతే కారణం : అద్వానీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): దేశంలోని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొవడంలో ప్రస్తుతం అనిశ్చితికి కేంద్ర ప్రభుత్వ అసమర్థతే కారణమని భాజపా అగ్రనేత ఎల్‌కే అద్వానీ అన్నారు. విపక్షాలను విమర్శిస్తూ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలు తమను బాధించినట్లు ఆయన చెప్పారు.