పాటియాలా హౌస్ కోర్టుకు భత్కల్ తరలింపు
ఢిల్లీ,(జనంసాక్షి): ఈ రోజు మధ్యాహ్నం బీహార్నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించిన ఉగ్రవాదులు భత్కల్, అఖ్తర్లను భద్రతాధికారులు న్యాయమూర్తి ముందు హాజరుపరచడానికి ఢిల్లీలోని పాటియాలా హౌస్ న్యాయస్థానానికి తీసుకువెళ్లారు.