భత్కల్‌ను కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): హైదారాబాద్‌లోనొ దిల్‌షుక్‌నగర్‌లో జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో నిందితులను ఢిల్లీ పోలీసులు పాటియాలా కోర్టులో హాజరుపరిచారు. నిందితులు యాసిన్‌ భత్కల్‌, అసదుల్లా అక్తర్‌లను పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి 12 రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులను కోర్టుకు తీసుకు వస్తున్నందున కోర్టు ఆవరణలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ఇద్దరు తీవ్రవాదులు నేపాల్‌ సరిహద్దులు దాటతుండగా భారత భద్రతా దళాలు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.